Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 08:14 PM

అవినీతి బయటపడుతుందనే భయంతోనే 'స్టే'లు!

అవినీతి బయటపడుతుందనే భయంతోనే 'స్టే'లు!

అవినీతి బయటపడుతుందనే భయంతోనే 'స్టే'లు!
April 22, 2026 06:34 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కాళేశ్వరం వైఫల్యాలకు బీఆర్ఎస్ బాధ్యత వహించాలి..

కేసుకు స్టే వస్తే గెలిచినట్లు గోబెల్స్ ప్రచారం పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ధ్వజం..


నకిరేకల్ : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి, నిర్మాణ లోపాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకుంటున్నారని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. బుధవారం నకిరేకల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు వైఫల్యాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు నియమించిన పీసీ ఘోష్ కమిషన్‌ను మొదటి నుంచీ బీఆర్ఎస్ అడ్డుకుంటోందని, తమ తప్పులు ఎక్కడ దొరికిపోతాయోనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.​ కోర్టు తీర్పును బీఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలంగా వక్రీకరించుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీరేశం ధ్వజమెత్తారు.

పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొన్ని సాంకేతిక అంశాలపై మాత్రమే చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించిందని అంతేకానీ కేసు మొత్తం గెలిచినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. స్టేలు తెచ్చుకుని తాము నిర్దోషులమని చెప్పుకోవడం అంటే తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడమేనని అసలు దొంగలెవరో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నాణ్యత లోపాల కారణంగా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని, దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అవసరమైతే సీబీఐ దర్యాప్తు కూడా చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ అవినీతిలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారు సైతం కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా తమ వైఖరిని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని కోరారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి దోచుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఇప్పుడు అహంకారంతో మాట్లాడటం విడ్డూరంగా ఉందని వీరేశం విమర్శించారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా అక్కడి నాయకులకు జ్ఞానోదయం కావాల్సిందని కానీ వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదని అన్నారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టి ప్రజల సొమ్మును దోచుకున్నారనేది తెలంగాణ సమాజం మొత్తం నమ్ముతోందని నిజాలు వెలుగులోకి వచ్చే వరకు తమ ప్రభుత్వం విశ్రమించబోదని ఆయన తేల్చి చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News