Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 12:28 PM

అత్నూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక – 200 మందితో భారీగా పార్టీ ప్రవేశం

అత్నూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక – 200 మందితో భారీగా పార్టీ ప్రవేశం

అత్నూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక – 200 మందితో భారీగా పార్టీ ప్రవేశం
April 23, 2026 04:43 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ మండలం, అత్నూర్: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ శెట్కార్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, డీసీసీ సభ్యుడు భాస్కర్ రెడ్డి సమక్షంలో ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.అత్నూర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షుడు రఫీయొద్దీన్ పటేల్, గ్రామ యూత్ ప్రెసిడెంట్ కలీమ్ పటేల్, ఇస్మాయిల్ సాబ్,

అత్నూర్ గ్రామ సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన దృశ్యం


రహీమ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్చన యాదవురావు పాటిల్‌తో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని నాయకులు అభినందించి, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.కార్యక్రమంలో రసూల్ పటేల్, ఎజాస్ పటేల్, జమీర్ పటేల్, సతీష్ పటేల్, అశోక్ పటేల్, మహమ్మద్ ముస్తఫ్ఫా సాబ్, అబ్దుల్ రహిమాన్, మాజీద్, శివాజీ గౌడ్, వీర రెడ్డి, వాజీద్ పటేల్, జహంగీర్ సాబ్, వెంకట్ రెడ్డి, ఖయ్యుమ్, ప్రకాష్, వజ్జన్న, యూసుఫ్ మియా, అబ్జాల్ మియా, మహాతబ్ సాబ్, యదుల్, వైజనాథ్, నర్సప్ప, చందర్, లక్ష్మణ్, దత్తు, గుండన్నా, బాబూగొండ, కిష్టప్ప, అక్బర్, బుద్దు, పండరి, కాశినాథ్, గొల్ల అశోక్, నయుమోద్దీన్, వెంకట్, శంకర్, సురేష్, ఇస్మాయిల్, గౌతమ్, సుధాకర్, దత్తు, బక్కన్న, గొల్ల కృష్ణ, సంతు పటేల్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News