అశ్వారావుపేటలో ఆధార పార్టీ హల్చల్!
అశ్వారావుపేటలో ఆధార పార్టీ హల్చల్!
స్థానికం బృందం
ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తున్న ప్రచారం!
22 వార్డుల్లో పూర్తి అభ్యర్థులతో రాజకీయ దుమారం!
అశ్వారావుపేట :
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రతిపాదన వెలువడిన నాటి నుంచి ఆధార పార్టీ అశ్వారావుపేట రాజకీయాన్ని షేక్ చేస్తోంది. ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా, మరింత ఉత్సాహంతో సాగుతున్న ప్రచారం ప్రత్యర్థి వర్గాల్లో స్పష్టమైన ఆందోళనను రేపుతోంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 22 వార్డులకుగాను ఆధార పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను బరిలో దింపడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో నేరుగా తలపడుతూ ఆధార పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలలో ఓటమి భయం మొదలైందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందన్న అంచనాతో జిల్లా స్థాయి నాయకులను కూడా రంగంలోకి దించినట్లు విశ్వసనీయ సమాచారం.గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధార పార్టీపై ప్రజల నమ్మకం పెరుగుతుండటం ఆయా పార్టీల పెద్దలకు నిద్ర లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార పార్టీకి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక కొందరు నేతలు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అదే ఆధార పార్టీకి బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అశ్వారావుపేట మున్సిపల్ రాజకీయాల్లో ఆధార పార్టీ ఇప్పుడు ప్రధాన శక్తిగా అవతరిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి