Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మలిదశ ఉద్యమకారుడి ఆకస్మిక మరణం “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:13 PM

అసీఫ్ నహర్ కాల్వ సమస్యల పరిష్కారానికి చర్యలు కోరుతూ వినతి

అసీఫ్ నహర్ కాల్వ సమస్యల పరిష్కారానికి చర్యలు కోరుతూ వినతి

అసీఫ్ నహర్ కాల్వ సమస్యల పరిష్కారానికి చర్యలు కోరుతూ వినతి
April 08, 2026 07:14 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల గ్రామ పరిధిలోని అసీఫ్ నహర్ కాల్వలో నీటిని తాత్కాలికంగా నిలిపివేసి విస్తృతంగా పెరిగిన గుర్రపుడెక్క ఆకును తొలగించాలని, అలాగే శిధిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన కాల్వ కట్టను తక్షణమే మరమ్మత్తు చేయాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం డిమాండ్ చేశారు.

గ్రామ రైతులతో కలిసి చిట్యాల నీటిపారుదల డిఇ కార్యాలయంలో సెక్షన్ అధికారి శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా కాల్వ నిరాటంకంగా ప్రవహిస్తుండడంతో గుర్రపుడెక్క ఆకు విస్తృతంగా పెరిగి కాల్వను పూర్తిగా ఆవరించి ప్రమాదకరంగా మారిందన్నారు.

అధిక ప్రవాహం సమయంలో నీరు కట్ట మించి వెళ్లడంతో పలుసార్లు కట్టలు తెగిన ఘటనలు జరిగాయని, దీనివల్ల తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. కాల్వ కట్ట కింద ఉన్న పొలాలు దెబ్బతిని రైతులు కోత కూడా కోయలేని పరిస్థితి ఏర్పడిందని, పైభాగంలోని పొలాలు నీటిలో మునిగి సాగుకు అనుకూలంగా లేకుండా పోయాయని వాపోయారు.

కట్టపై చెట్లు, కంపలు పెరిగి అడ్డంగా పడిపోయి ఉన్నాయని, పర్యవేక్షణ లోపించిందని అన్నారు. దశాబ్ద కాలంగా రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఒక నెలపాటు నీటి ప్రవాహాన్ని తగ్గించి గుర్రపుడెక్క ఆకును తొలగించి, కాల్వ కట్టను బలపర్చాలని కోరారు.

అలాగే అసీఫ్ నహర్ కాల్వకు నీటి విడుదలపై వార్షిక సమయ ప్రణాళిక ప్రకటించాలని, తద్వారా రైతులు ఒకేసారి పంటలు వేయడానికి సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఈ విషయమై నీటిపారుదల డిఇ సునీత నందను సంప్రదించగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, మాజీ ఉపసర్పంచ్ మామిడి పాండు రెడ్డి, రైతులు మన్నెం పద్మారెడ్డి, కల్లూరి రవికుమార్, మేకల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News