Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 12:57 AM

అసెంబ్లీ సాధనకు గ్రామాల నుంచే సంకల్పం నూతన సర్పంచులకు ఘన సన్మానం

అసెంబ్లీ సాధనకు గ్రామాల నుంచే సంకల్పం నూతన సర్పంచులకు ఘన సన్మానం

అసెంబ్లీ సాధనకు గ్రామాల నుంచే సంకల్పం నూతన సర్పంచులకు ఘన సన్మానం
February 25, 2026 04:06 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నియోజకవర్గ సాధన దిశగా గ్రామాల నుంచే ఉద్యమం ముమ్మరం చేయాలని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి పిలుపునిచ్చింది. మండలంలోని వివిధ గ్రామాలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులను సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నీర్నెముల సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, బోగారం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, జనంపల్లి సర్పంచ్ బండ సరోజ, మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, కుంకుడు పాముల సర్పంచ్ గొలుసుల సత్తయ్య, సూరారం సర్పంచ్ శ్రీనివాస్‌లను శాలువాలతో సత్కరించి అభినందించారు.

సమితి గౌరవాధ్యక్షులు రెబ్బలు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో రామన్నపేటను అసెంబ్లీ కేంద్రంగా సాధించేందుకు అన్ని గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీ స్థాయిలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలని, మండల పరిషత్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీజేఎస్ మండల అధ్యక్షులు గడ్డం యాదగిరి, టిడిపి మండల అధ్యక్షులు ఎండి ఫజల్, కాంగ్రెస్ మండల నాయకులు కూనూరు కృష్ణ గౌడ్, బీఎస్పీ మండల అధ్యక్షులు నగరికంటి నరేష్, సిపిఐ మండల నాయకులు శ్రీ రామోజీ నరసింహాచారి, పెండెం రవీందర్, గంగాపురం వెంకటయ్య, ఎండి ఇమామ్ సాహెబ్, పోలగోని నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News