ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ఘన సన్మానం
ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ఘన సన్మానం
Editor Desk
హయత్నగర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించారు. పరిశోధన, పీహెచ్డీ డిగ్రీ సాధన, బోధనలో అంకితభావం, విద్యా రంగానికి అందించిన సేవలకు గాను ఈ సత్కారం నిర్వహించారు.
సన్మానించబడినవారిలో డా. ఎస్. సుబ్రహ్మణ్యం, డా. పి. రమాదేవి (కామర్స్), డా. శ్రీపతి నాయుడు (రాజకీయ శాస్త్రం), డా. డి. మక్లా (ఆంగ్లం), డా. మధు ధర్మపురి (భౌతిక శాస్త్రం), డా. బాలనరసింహ (రసాయన శాస్త్రం) ఉన్నారు.
కార్యక్రమాన్ని స్టాఫ్ క్లబ్ కార్యదర్శి డా. ఎస్. సుబ్రహ్మణ్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు మాట్లాడుతూ అధ్యాపకుల నిరంతర కృషి, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో వారి పాత్ర ప్రశంసనీయమని అన్నారు. విద్య, పరిశోధన, సంస్థ అభివృద్ధిలో వారు సాధించిన విజయాలను కొనియాడారు.
అధ్యాపకులను గౌరవించడం ద్వారా విద్యా శ్రేష్ఠతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి, ఇందిర, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి