ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
Editor Desk
యాదగిరిగుట్ట: ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులకు సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజాసేవలో కీలకంగా నిలబెట్టాలని, కార్మికుల హక్కులను అమలు చేయాలని కోరారు.
కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న వేతన సవరణలు, పిఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, నియామక తేదీలను ప్రకటించాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సులను రద్దు చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళేం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, కొల్లూరి రాజయ్య, పెరబోయిన మహేందర్, గోరేటి రాములు, కల్లేపల్లి మహేందర్, పెరబోయిన బంగారి, సామల భాస్కర్, ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగ, ప్రభాకర్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి