Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:57 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
April 22, 2026 04:43 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులకు సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజాసేవలో కీలకంగా నిలబెట్టాలని, కార్మికుల హక్కులను అమలు చేయాలని కోరారు.

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు, పిఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, నియామక తేదీలను ప్రకటించాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సులను రద్దు చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళేం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, కొల్లూరి రాజయ్య, పెరబోయిన మహేందర్, గోరేటి రాములు, కల్లేపల్లి మహేందర్, పెరబోయిన బంగారి, సామల భాస్కర్, ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగ, ప్రభాకర్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News