Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:42 PM

ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాకు బీజేపీ సంఘీభావం

ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాకు బీజేపీ సంఘీభావం

ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాకు బీజేపీ సంఘీభావం
April 24, 2026 10:02 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం.. అశోక్ గౌడ్

యాదగిరిగుట్ట,ఏప్రిల్ 24(నిజంచెపుతాం)యాదగిరిగుట్ట డిపోలో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు నిర్వహిస్తున్న ధర్నాకు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ఆధ్వర్యంలో నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 41 రోజుల ముందుగా నోటీసు ఇచ్చినా సమస్యలను పట్టించుకోలేదని,గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు.ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, కార్మికులతో కలిసి నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.ఇదే సందర్భంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతిచెందిన కోల శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్,తుమ్మల మురళీధర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శులు కదూరి అచ్చయ్య,చందా మహేందర్ గుప్తా,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్,జిల్లా కార్యదర్శులు కమిటీకారి కృష్ణ,తడిసిన మల్లారెడ్డి,కోశాధికారి సోమా నర్సయ్య, కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహారావు,ఇతర నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News