ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాకు బీజేపీ సంఘీభావం
ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాకు బీజేపీ సంఘీభావం
Sthanikam District Staff Reporter
-సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం.. అశోక్ గౌడ్
యాదగిరిగుట్ట,ఏప్రిల్ 24(నిజంచెపుతాం)యాదగిరిగుట్ట డిపోలో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు నిర్వహిస్తున్న ధర్నాకు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ ఆధ్వర్యంలో నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 41 రోజుల ముందుగా నోటీసు ఇచ్చినా సమస్యలను పట్టించుకోలేదని,గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు.ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, కార్మికులతో కలిసి నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.ఇదే సందర్భంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతిచెందిన కోల శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్,తుమ్మల మురళీధర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శులు కదూరి అచ్చయ్య,చందా మహేందర్ గుప్తా,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్,జిల్లా కార్యదర్శులు కమిటీకారి కృష్ణ,తడిసిన మల్లారెడ్డి,కోశాధికారి సోమా నర్సయ్య, కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహారావు,ఇతర నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి