PRINT TIME: April 24, 2026 04:15 PM
ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం
ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం
April 24, 2026 02:52 PM
26 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఇంద్రపాలనగరం: ఆర్టీసీ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కొనసాగుతున్న సమ్మెకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ సంఘీభావం ప్రకటించారు. సమ్మెలో ఉన్న కార్మికులను కలిసి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేసి, ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా తమ హక్కుల కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి