PRINT TIME: April 23, 2026 07:01 PM
ఆర్టీసీ సమ్మె వేళ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆర్టీసీ సమ్మె వేళ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
April 23, 2026 05:21 PM
44 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నర్సంపేట,
ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో నర్సంపేట బస్టాండ్ ఎదుట ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సమీపంలో ఉన్న తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి