Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారులకు ఆశీర్వాదం అందించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 10:32 PM

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది....

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది....

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది....
April 26, 2026 08:38 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం....



ప్రభుత్వం డిమాండ్ల అంగీకారం పై కోదాడ ఆర్టీసీ డిపోలో కార్మికుల పాలాభిషేకం ఉత్సవాలు...


ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి లు అన్నారు. ఆదివారం కోదాడ ఆర్టిసి డిపోలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను అంగీకారం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ఫ్లెక్సీ లకు నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తుందన్నారు. మహా లక్ష్మీ పథకం అమలు లో ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంస నీయం అన్నారు. ఆర్టీసీ నీ గత ప్రభుత్వం నిర్వర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చి మహా లక్ష్మీ మహిళల కు ఉచిత బస్సు పథకం పెట్టి ఆర్టీసీ కి వైభవం తెచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమిష్టి గా పని చేస్తూ ఆర్టీసీ నీ లాభాల బాట లోకి తెచ్చారని కార్మికుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ఆర్టిసి నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్ లు అంగీకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు బి. పుల్లయ్య, చక్రపాణి, ఎస్. ఎస్. గౌడ్, అబ్దుల్, ఎస్. జానయ్య, ఎన్వి చారి ,రాజశేఖర్, సుధారాణి, శ్రీదేవి, నాగమణి, రవి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News