Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 08:30 PM

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది....

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది....

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది....
April 26, 2026 08:38 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం....



ప్రభుత్వం డిమాండ్ల అంగీకారం పై కోదాడ ఆర్టీసీ డిపోలో కార్మికుల పాలాభిషేకం ఉత్సవాలు...


ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి లు అన్నారు. ఆదివారం కోదాడ ఆర్టిసి డిపోలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను అంగీకారం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ఫ్లెక్సీ లకు నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తుందన్నారు. మహా లక్ష్మీ పథకం అమలు లో ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంస నీయం అన్నారు. ఆర్టీసీ నీ గత ప్రభుత్వం నిర్వర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చి మహా లక్ష్మీ మహిళల కు ఉచిత బస్సు పథకం పెట్టి ఆర్టీసీ కి వైభవం తెచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమిష్టి గా పని చేస్తూ ఆర్టీసీ నీ లాభాల బాట లోకి తెచ్చారని కార్మికుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ఆర్టిసి నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్ లు అంగీకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు బి. పుల్లయ్య, చక్రపాణి, ఎస్. ఎస్. గౌడ్, అబ్దుల్, ఎస్. జానయ్య, ఎన్వి చారి ,రాజశేఖర్, సుధారాణి, శ్రీదేవి, నాగమణి, రవి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News