Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి జాతర.. తొలి గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 03:32 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డివైఎఫ్ఐ మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డివైఎఫ్ఐ మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డివైఎఫ్ఐ మద్దతు
April 23, 2026 01:26 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం నల్గొండలో జరిగిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ ఈ మేరకు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి Revanth Reddy మద్దతు తెలిపి, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని కోరారు. భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాలకు డివైఎఫ్ఐ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పోకల శశిధర్, నాయకులు బాలరాజు, ఆంజనేయులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News