Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:54 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డివైఎఫ్ఐ మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డివైఎఫ్ఐ మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డివైఎఫ్ఐ మద్దతు
April 23, 2026 01:26 PM 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం నల్గొండలో జరిగిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ ఈ మేరకు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి Revanth Reddy మద్దతు తెలిపి, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని కోరారు. భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాలకు డివైఎఫ్ఐ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పోకల శశిధర్, నాయకులు బాలరాజు, ఆంజనేయులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News