Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 10:23 PM

ఆర్జలభావి కొనుగోలు కేంద్రం సందర్శనకు బీజేపీ బృందం సిద్ధం

ఆర్జలభావి కొనుగోలు కేంద్రం సందర్శనకు బీజేపీ బృందం సిద్ధం

ఆర్జలభావి కొనుగోలు కేంద్రం సందర్శనకు బీజేపీ బృందం సిద్ధం
April 07, 2026 08:39 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: ఆర్జలభావి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ బృందం త్వరలో సందర్శించనుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు.

జిల్లాలో వరి కోతలు మార్చి మొదటి వారం నుంచే ప్రారంభమైనప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యమవుతోందని ఆయన విమర్శించారు. అనేక ప్రాంతాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

IKP, PACS ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయని, తూకం యంత్రాలు, బస్తాల సరఫరా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. మిల్లులకు ట్యాగింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు తమ పంటను విక్రయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ పరిస్థితిని కొందరు రైస్ మిల్లర్లు ఉపయోగించుకొని రైతుల నుండి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1066 కొనుగోలు కేంద్రాలు ఉండగా, అందులో వంద కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News