Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:29 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు… మండల సభలో స్పష్టమైన దిశానిర్దేశం. అదనప కలెక్టర్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు… మండల సభలో స్పష్టమైన దిశానిర్దేశం. అదనప కలెక్టర్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు… మండల సభలో స్పష్టమైన దిశానిర్దేశం. అదనప కలెక్టర్
16-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు,

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పకడ్బందీగా చేరేలా చర్యలు తీసుకోవాలని, మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి మండల సభలు సమర్థ వేదికగా నిలుస్తాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు.

99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సభను నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షించారు.

రెవెన్యూ, విద్య, వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరా కాంతి, చేయూత పింఛన్ల అమలుపై అధికారులు నివేదికలు సమర్పించారు. సర్పంచులు, అధికారులకు అదనపు కలెక్టర్ తగు సూచనలు చేశారు.

వ్యవసాయంపై చర్చలో భాగంగా యూరియా యాప్‌ను వినియోగించి ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా చూడాలని సూచించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను ప్రజలకు చేరవేయాలని, విద్యుత్ విభాగంలో సూర్యగర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. విద్యా రంగంలో గ్రామాల్లో ప్రతి బాలబాలిక పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ ఆంజనేయులు, జిల్లా వైద్యాధికారి డా. మనోహర్, సీఐ డీ. యాదాద్రి, మండల పంచాయతీ అధికారి అనురాధ దేవి, పర్యవేక్షకులు హరిత దేవి, గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులందరికీ సంక్షేమ పథకాలు… మండల సభలో స్పష్టమైన దిశానిర్దేశం. అదనప కలెక్టర్

Article Image

ఆలేరు,

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పకడ్బందీగా చేరేలా చర్యలు తీసుకోవాలని, మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి మండల సభలు సమర్థ వేదికగా నిలుస్తాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు.

99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సభను నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షించారు.

రెవెన్యూ, విద్య, వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరా కాంతి, చేయూత పింఛన్ల అమలుపై అధికారులు నివేదికలు సమర్పించారు. సర్పంచులు, అధికారులకు అదనపు కలెక్టర్ తగు సూచనలు చేశారు.

వ్యవసాయంపై చర్చలో భాగంగా యూరియా యాప్‌ను వినియోగించి ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా చూడాలని సూచించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను ప్రజలకు చేరవేయాలని, విద్యుత్ విభాగంలో సూర్యగర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. విద్యా రంగంలో గ్రామాల్లో ప్రతి బాలబాలిక పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ ఆంజనేయులు, జిల్లా వైద్యాధికారి డా. మనోహర్, సీఐ డీ. యాదాద్రి, మండల పంచాయతీ అధికారి అనురాధ దేవి, పర్యవేక్షకులు హరిత దేవి, గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News