Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 09:50 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు… మండల సభలో స్పష్టమైన దిశానిర్దేశం. అదనప కలెక్టర్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు… మండల సభలో స్పష్టమైన దిశానిర్దేశం. అదనప కలెక్టర్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు… మండల సభలో స్పష్టమైన దిశానిర్దేశం. అదనప కలెక్టర్
April 16, 2026 07:26 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు,

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పకడ్బందీగా చేరేలా చర్యలు తీసుకోవాలని, మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి మండల సభలు సమర్థ వేదికగా నిలుస్తాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు.

99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సభను నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షించారు.

రెవెన్యూ, విద్య, వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరా కాంతి, చేయూత పింఛన్ల అమలుపై అధికారులు నివేదికలు సమర్పించారు. సర్పంచులు, అధికారులకు అదనపు కలెక్టర్ తగు సూచనలు చేశారు.

వ్యవసాయంపై చర్చలో భాగంగా యూరియా యాప్‌ను వినియోగించి ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా చూడాలని సూచించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను ప్రజలకు చేరవేయాలని, విద్యుత్ విభాగంలో సూర్యగర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. విద్యా రంగంలో గ్రామాల్లో ప్రతి బాలబాలిక పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ ఆంజనేయులు, జిల్లా వైద్యాధికారి డా. మనోహర్, సీఐ డీ. యాదాద్రి, మండల పంచాయతీ అధికారి అనురాధ దేవి, పర్యవేక్షకులు హరిత దేవి, గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News