ఆర్బీవీఆర్ఈఎస్ నూతన కమిటీ ఏకగ్రీవం అధ్యక్షుడిగా గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్రెడ్డి
ఆర్బీవీఆర్ఈఎస్ నూతన కమిటీ ఏకగ్రీవం అధ్యక్షుడిగా గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్రెడ్డి
Editor Desk
హైదరాబాద్,
రాజా బహదూర్ వెంకట రామ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన కార్యవర్గం 2026–2029 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అన్ని పదవులు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి.
నూతన అధ్యక్షుడిగా బీరవెల్లి గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఊరుకొండ ప్రభాకర్రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోపాల్రెడ్డి మాట్లాడుతూ… బీద విద్యార్థులు, రైతులకు విద్య, వైద్య రంగాల్లో అండగా నిలుస్తామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు.
ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ… హాస్టల్ భవనాన్ని అభివృద్ధి చేసి కొత్త సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యవర్గ సహకారంతో సంస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
ఎన్నికల అధికారిగా మాలే వెంకట్రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కట్టా అనంతరెడ్డి, మూల దయాకర్రెడ్డి, బూసిరెడ్డి సుధీర్రెడ్డి, అయ్యాడపు నర్సిరెడ్డి, పుట్ట కృష్ణ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇతర పదవులు:
ఉపాధ్యక్షులు – ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి, కర్నాటి కరుణాకర్రెడ్డి, ఏపాల సత్యనారాయణరెడ్డి
జాయింట్ సెక్రటరీలు – అలుగుబెల్లి సురేందర్రెడ్డి, దుబ్బాక వెంకట్రెడ్డి, నీరుడు గోవర్ధన్రెడ్డి
ఖజాంచీ – పాదూరి ఇంద్రసేనారెడ్డి
కార్యవర్గ సభ్యులుగా పలువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి