Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:32 PM

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
10-03-2026 936 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పనిలేక అప్పుల ఒత్తిడి.. చేనేత కార్మికుడి ఆత్మహత్య

రామన్నపేట,

అప్పుల భారాన్ని తట్టుకోలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య అంజలి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చేనేత పనుల కోసం ఐదేళ్ల క్రితం భువనగిరిలోని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థలో రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాడు.

గత రెండు నెలలుగా చేనేత పనులు లేకపోవడంతో ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. అప్పుల ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురైన బాలరాజు మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Sthanikam

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

Article Image

పనిలేక అప్పుల ఒత్తిడి.. చేనేత కార్మికుడి ఆత్మహత్య

రామన్నపేట,

అప్పుల భారాన్ని తట్టుకోలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య అంజలి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చేనేత పనుల కోసం ఐదేళ్ల క్రితం భువనగిరిలోని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థలో రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాడు.

గత రెండు నెలలుగా చేనేత పనులు లేకపోవడంతో ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. అప్పుల ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురైన బాలరాజు మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News