Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన.. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 PM

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
March 10, 2026 11:36 PM 932 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పనిలేక అప్పుల ఒత్తిడి.. చేనేత కార్మికుడి ఆత్మహత్య

రామన్నపేట,

అప్పుల భారాన్ని తట్టుకోలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య అంజలి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చేనేత పనుల కోసం ఐదేళ్ల క్రితం భువనగిరిలోని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థలో రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాడు.

గత రెండు నెలలుగా చేనేత పనులు లేకపోవడంతో ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. అప్పుల ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురైన బాలరాజు మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News