ఆపదలో ఆదుకుని… ఆస్తి కాపాడిన 108 సిబ్బంది
ఆపదలో ఆదుకుని… ఆస్తి కాపాడిన 108 సిబ్బంది
Editor Desk
కుత్బుల్లాపూర్/జీడిమెట్ల:
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కాకుండా, బాధితుడి విలువైన వస్తువులను సురక్షితంగా అప్పగించి 108 అంబులెన్స్ సిబ్బంది తమ నిజాయితీని మరోసారి చాటుకున్నారు.
ఘటన వివరాలు: నిజామాబాద్ జిల్లాకు చెందిన శివ ప్రసాద్ గౌడ్ శనివారం సుచిత్ర నుంచి మేడ్చల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, జీడిమెట్ల గ్రామ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది—ఈఎంటీ (EMT) రాజు, పైలట్ నవీన్—బాధితుడికి ప్రథమ చికిత్స అందించి సమీప ఆసుపత్రికి తరలించారు.
నిజాయితీకి నిదర్శనం: బాధితుడి వద్ద ఉన్న బంగారు గొలుసు, వెండి బ్రాస్లెట్, రెండు మొబైల్ ఫోన్లు, సుమారు రూ.2 లక్షల నగదును అంబులెన్స్ సిబ్బంది భద్రపరిచారు. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న బాధితుడి స్నేహితులను పిలిపించి, వారి సమక్షంలో ఆ నగదు, వస్తువులను క్షేమంగా అప్పగించారు.
ప్రాణాలను కాపాడటంతో పాటు లక్షల విలువైన ఆస్తిని కూడా సురక్షితంగా అందజేసిన పైలట్ నవీన్, ఈఎంటీ రాజుల నిజాయితీని బాధితుడి స్నేహితులు, స్థానికులు ప్రశంసించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి