Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:02 PM

అనాథలైన చిన్నారులకు ఆర్థిక భరోసా… ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు

అనాథలైన చిన్నారులకు ఆర్థిక భరోసా… ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు

అనాథలైన చిన్నారులకు ఆర్థిక భరోసా… ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు
April 07, 2026 10:51 AM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లోని సిరిపురం గ్రామానికి చెందిన మాండ్ర మల్లేష్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు ఆదర్శంగా ముందుకొచ్చారు. ZPHS సిరిపురం 1996–97 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు మల్లేష్ కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం చెరి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1 లక్షను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందించారు.

కుటుంబ పెద్దను కోల్పోయి ఆవేదనలో ఉన్న చిన్నారులకు భరోసా కల్పిస్తూ “మేమున్నాం” అని చేయూతనివ్వడం హృదయానికి హత్తుకునే ఘటనగా గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. సామాజిక బాధ్యతను గుర్తించి పూర్వ విద్యార్థులు చేసిన ఈ సహాయం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ సహాయక కార్యక్రమంలో మొగిలి శ్రీనివాస్, సిల్వేరు ఉపేందర్, బెల్లంకొండ నగేష్, సంగిశెట్టి భాస్కర్, కంకల మల్లేష్, సంగిశెట్టి రమేష్, బెల్లంకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News