అనాథలైన చిన్నారులకు ఆర్థిక భరోసా… ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు
అనాథలైన చిన్నారులకు ఆర్థిక భరోసా… ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు
Editor Desk
రామన్నపేట మండలం లోని సిరిపురం గ్రామానికి చెందిన మాండ్ర మల్లేష్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు ఆదర్శంగా ముందుకొచ్చారు. ZPHS సిరిపురం 1996–97 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు మల్లేష్ కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం చెరి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1 లక్షను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందించారు.
కుటుంబ పెద్దను కోల్పోయి ఆవేదనలో ఉన్న చిన్నారులకు భరోసా కల్పిస్తూ “మేమున్నాం” అని చేయూతనివ్వడం హృదయానికి హత్తుకునే ఘటనగా గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. సామాజిక బాధ్యతను గుర్తించి పూర్వ విద్యార్థులు చేసిన ఈ సహాయం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ సహాయక కార్యక్రమంలో మొగిలి శ్రీనివాస్, సిల్వేరు ఉపేందర్, బెల్లంకొండ నగేష్, సంగిశెట్టి భాస్కర్, కంకల మల్లేష్, సంగిశెట్టి రమేష్, బెల్లంకొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి