Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:56 PM

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి
April 11, 2026 06:07 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: దేశానికి అన్నం పెట్టే రైతులు పాలకుల అసమర్థ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, కార్పొరేట్లకు అనుకూలంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటే వారు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అఖిల భారత కిసాన్ సభ స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్ర కలిగిన సంస్థ అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బోయిని ఆనంద్, గన్నబోయిన విజయభాస్కర్, భావండ్లపల్లి బాలరాజు, తాడూరి కృష్ణయ్య, కందుల మల్లారెడ్డి, బల్గూరి అంజయ్య, కొమ్ము అంజయ్య, అప్పం సురేందర్, వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News