Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 07:40 PM

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి
April 11, 2026 06:07 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: దేశానికి అన్నం పెట్టే రైతులు పాలకుల అసమర్థ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, కార్పొరేట్లకు అనుకూలంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటే వారు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అఖిల భారత కిసాన్ సభ స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్ర కలిగిన సంస్థ అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బోయిని ఆనంద్, గన్నబోయిన విజయభాస్కర్, భావండ్లపల్లి బాలరాజు, తాడూరి కృష్ణయ్య, కందుల మల్లారెడ్డి, బల్గూరి అంజయ్య, కొమ్ము అంజయ్య, అప్పం సురేందర్, వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News