అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి
Editor Desk
రామన్నపేట: దేశానికి అన్నం పెట్టే రైతులు పాలకుల అసమర్థ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, కార్పొరేట్లకు అనుకూలంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటే వారు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అఖిల భారత కిసాన్ సభ స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్ర కలిగిన సంస్థ అని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బోయిని ఆనంద్, గన్నబోయిన విజయభాస్కర్, భావండ్లపల్లి బాలరాజు, తాడూరి కృష్ణయ్య, కందుల మల్లారెడ్డి, బల్గూరి అంజయ్య, కొమ్ము అంజయ్య, అప్పం సురేందర్, వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి