Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:45 PM

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి
11-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: దేశానికి అన్నం పెట్టే రైతులు పాలకుల అసమర్థ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, కార్పొరేట్లకు అనుకూలంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటే వారు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అఖిల భారత కిసాన్ సభ స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్ర కలిగిన సంస్థ అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బోయిని ఆనంద్, గన్నబోయిన విజయభాస్కర్, భావండ్లపల్లి బాలరాజు, తాడూరి కృష్ణయ్య, కందుల మల్లారెడ్డి, బల్గూరి అంజయ్య, కొమ్ము అంజయ్య, అప్పం సురేందర్, వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి

Article Image

రామన్నపేట: దేశానికి అన్నం పెట్టే రైతులు పాలకుల అసమర్థ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, కార్పొరేట్లకు అనుకూలంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటే వారు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అఖిల భారత కిసాన్ సభ స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప చరిత్ర కలిగిన సంస్థ అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బోయిని ఆనంద్, గన్నబోయిన విజయభాస్కర్, భావండ్లపల్లి బాలరాజు, తాడూరి కృష్ణయ్య, కందుల మల్లారెడ్డి, బల్గూరి అంజయ్య, కొమ్ము అంజయ్య, అప్పం సురేందర్, వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News