Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:59 PM

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి
April 11, 2026 02:46 PM 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మహాత్మా జ్యోతీరావ్ పూలే జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ విశ్రాంతి భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, కార్యనిర్వహణ కార్యదర్శి గుండాల నరసింహ, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ మాట్లాడుతూ పూలే కుల వ్యవస్థ, మహిళల సమస్యలను ఎత్తిచూపిన మహనీయుడని కొనియాడారు. మహిళల విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారని గుర్తుచేశారు.

సమాన హక్కులు, విద్య, ప్రశ్నించే స్వభావం అవసరాన్ని “గులాంగిరి” వంటి రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారని తెలిపారు. 1873లో ‘సత్యశోధక్ సమాజ్’ స్థాపించి సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు.

విద్య ద్వారానే అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని నమ్మిన పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటి రమేష్, సర్పంచ్ కోళ్ళ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ నాసర్, బొడ్డు సురేందర్ రావు, వనం చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్, మొహమ్మద్ రెహాన్, మొహమ్మద్ అకరం, బొడ్డు వెంకటేశ్వర్లు, కొమ్ము శేఖర్, మొహమ్మద్ అంజత్, గొరిగే శేఖర్, గొలుసుల ప్రసాద్, మీర్జా అసలం బేగ్, మేడి శంకరయ్య, సత్యప్రకాశ్, కంచి మల్లేష్, లవణం సాయి, రాపోలు ఉపేందర్, చింతల కృష్ణ, మేడి ధ్రువ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News