Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:08 AM

అమెరికా యుద్ధోన్మాదంపై నోరు విప్పాలి: సీపీఎం

అమెరికా యుద్ధోన్మాదంపై నోరు విప్పాలి: సీపీఎం

అమెరికా యుద్ధోన్మాదంపై నోరు విప్పాలి: సీపీఎం
March 09, 2026 06:59 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఇరాన్‌పై ఇజ్రాయిల్–అమెరికా దాడిని ఖండించకుండా భారత ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య విమర్శించారు. సోమవారం రామన్నపేటలోని సీపీఎం మండల కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

అమెరికా ఆయుధ శక్తితో చమురు నిల్వలు ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని, ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడులు చేస్తూ అమాయక ప్రజలను బలితీసుకుంటున్నప్పటికీ భారత ప్రధాని స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ యుద్ధ ప్రభావంతో దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోందని తెలిపారు.

ప్రధాని ఇజ్రాయిల్ పర్యటన అనంతరం ఇరాన్‌పై దాడులు జరగడం ప్రపంచ దేశాల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు. అమెరికాతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం ఆందోళనలకు పిలుపునిచ్చిందని, గ్రామీణ ప్రజలందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని కోరారు.

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, ఏభూషి నర్సింహా, బోయిని ఆనంద్, కందుల హనుమంతు, గన్నేబోయిన విజయభాస్కర్, గొరిగె సోములు, భావండ్లపల్లి బాలరాజు, నాగటి ఉపేందర్, ఎండీ రషీద్, బోడిగె రజిత, గంటేపాక శివకుమార్, మునికుంట్ల లెనిన్, శానకొండ రామచంద్రం, గుణగంటి మల్లేశం, పల్లె సత్యనారాయణ, జల్లెల మల్లేశం తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News