Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:17 AM

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన
March 10, 2026 05:52 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమెరికా సామ్రాజ్యవాద విధానాలను నిరసిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్లగొండలోని సుభాష్ సెంటర్ వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద విధానాలు ప్రపంచంలో యుద్ధాలను ప్రోత్సహిస్తూ దేశాలను వలసల పాలనలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయిల్‌ను అమెరికా ప్రోత్సహిస్తోందని, ఈ యుద్ధాల కారణంగా వేలాది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యుద్ధాలను నిలిపివేసి ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద శక్తులకు మొగ్గుచూపుతున్న తీరు ఖండనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ రాష్ట్ర కో-కన్వీనర్ కుంచెం కావ్య, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, రియాజ్, మాజీ డివైఎఫ్‌ఐ నాయకులు మన్నెం బిక్షం, మహేష్, తరుణ్, లక్ష్మణ్, శివ, ఉపేందర్, సత్యనారాయణ, యాదగిరి, రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News