Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:58 AM

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన
March 10, 2026 05:52 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమెరికా సామ్రాజ్యవాద విధానాలను నిరసిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నల్లగొండలోని సుభాష్ సెంటర్ వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద విధానాలు ప్రపంచంలో యుద్ధాలను ప్రోత్సహిస్తూ దేశాలను వలసల పాలనలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయిల్‌ను అమెరికా ప్రోత్సహిస్తోందని, ఈ యుద్ధాల కారణంగా వేలాది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యుద్ధాలను నిలిపివేసి ప్రపంచ శాంతిని కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాద శక్తులకు మొగ్గుచూపుతున్న తీరు ఖండనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ రాష్ట్ర కో-కన్వీనర్ కుంచెం కావ్య, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, రియాజ్, మాజీ డివైఎఫ్‌ఐ నాయకులు మన్నెం బిక్షం, మహేష్, తరుణ్, లక్ష్మణ్, శివ, ఉపేందర్, సత్యనారాయణ, యాదగిరి, రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News