Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:08 AM

అమరజీవి నర్రా రాఘవరెడ్డి వర్ధంతి.. పోరాటాల పథం గుర్తుచేసిన సిపిఎం నేతలు

అమరజీవి నర్రా రాఘవరెడ్డి వర్ధంతి.. పోరాటాల పథం గుర్తుచేసిన సిపిఎం నేతలు

అమరజీవి నర్రా రాఘవరెడ్డి వర్ధంతి.. పోరాటాల పథం గుర్తుచేసిన సిపిఎం నేతలు
April 09, 2026 11:04 AM 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు గ్రామంలో గురువారం అమరజీవి నర్రా రాఘవరెడ్డి 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, మండల మాజీ కార్యదర్శి అరూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నర్రా రాఘవరెడ్డి ఫ్లోరైడ్ విముక్తి పోరాటం, ఎస్ఎల్బీసీ సొరంగం సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడని పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య నిర్మూలనపై ఆయనకు ఉన్న కట్టుదిట్టమైన సంకల్పమే ఎస్ఎల్బీసీ లిఫ్ట్ స్కీమ్ రూపుదిద్దుకునేందుకు దోహదపడిందన్నారు. నార్ల తాతారావును వెంటబెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి ప్రాజెక్టును లిఫ్ట్ ద్వారా పూర్తి చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధతతో పనిచేసిన నర్రా రాఘవరెడ్డి, ఏ అంశాన్నైనా లోతుగా చర్చించి పరిష్కారం చూపే నాయకుడని కొనియాడారు. నేటి ప్రజాప్రతినిధులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో మమేకమై పనిచేయాలని సూచించారు.

తన జీవితమంతా పోరాటాలతో గడిపినా ఆశయాలపై ఎప్పుడూ రాజీ పడలేదని, చివరి వరకు ప్రజల కోసం నిలబడిన మహనీయుడని పేర్కొన్నారు. అధికారులతో కూడా తెలుగు భాషలోనే మాట్లాడి, ప్రజలకు మాతృభాషలో సమాధానాలు ఇవ్వాలని చెప్పే నాయకుడని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించి, ప్రతి పెద్ద గ్రామంలో హైస్కూల్ నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజల అనారోగ్య సమయంలో స్వయంగా ముందుండి వైద్యం చేయించే నాయకత్వం ఆయనదేనని అన్నారు.

ఈ కార్యక్రమం సిపిఎం మండల కమిటీ సభ్యుడు పంది నరేష్ అధ్యక్షతన జరిగింది. ఇందులో మండల కమిటీ సభ్యులు నేలికంటి నర్సింహా, శాఖ కార్యదర్శులు అరూరి దుర్గయ్య, సూరకంటి మోహన్ రెడ్డి, అరూరి శంబయ్య, ఆడెపు రమేష్, మామిడి రాములు, బొంగు లక్ష్మి నరసింహ స్వామి, కందటి యాదిరెడ్డి, గోలి నరసింహ, వట్టిపల్లి యాదయ్య, ఎంపాల లచిరెడ్డి, బొంగు నరేందర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News