అమరజీవి నర్రా రాఘవరెడ్డి వర్ధంతి.. పోరాటాల పథం గుర్తుచేసిన సిపిఎం నేతలు
అమరజీవి నర్రా రాఘవరెడ్డి వర్ధంతి.. పోరాటాల పథం గుర్తుచేసిన సిపిఎం నేతలు
Editor Desk
వెలిమినేడు గ్రామంలో గురువారం అమరజీవి నర్రా రాఘవరెడ్డి 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్, మండల మాజీ కార్యదర్శి అరూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నర్రా రాఘవరెడ్డి ఫ్లోరైడ్ విముక్తి పోరాటం, ఎస్ఎల్బీసీ సొరంగం సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య నిర్మూలనపై ఆయనకు ఉన్న కట్టుదిట్టమైన సంకల్పమే ఎస్ఎల్బీసీ లిఫ్ట్ స్కీమ్ రూపుదిద్దుకునేందుకు దోహదపడిందన్నారు. నార్ల తాతారావును వెంటబెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి ప్రాజెక్టును లిఫ్ట్ ద్వారా పూర్తి చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధతతో పనిచేసిన నర్రా రాఘవరెడ్డి, ఏ అంశాన్నైనా లోతుగా చర్చించి పరిష్కారం చూపే నాయకుడని కొనియాడారు. నేటి ప్రజాప్రతినిధులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో మమేకమై పనిచేయాలని సూచించారు.
తన జీవితమంతా పోరాటాలతో గడిపినా ఆశయాలపై ఎప్పుడూ రాజీ పడలేదని, చివరి వరకు ప్రజల కోసం నిలబడిన మహనీయుడని పేర్కొన్నారు. అధికారులతో కూడా తెలుగు భాషలోనే మాట్లాడి, ప్రజలకు మాతృభాషలో సమాధానాలు ఇవ్వాలని చెప్పే నాయకుడని తెలిపారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించి, ప్రతి పెద్ద గ్రామంలో హైస్కూల్ నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజల అనారోగ్య సమయంలో స్వయంగా ముందుండి వైద్యం చేయించే నాయకత్వం ఆయనదేనని అన్నారు.
ఈ కార్యక్రమం సిపిఎం మండల కమిటీ సభ్యుడు పంది నరేష్ అధ్యక్షతన జరిగింది. ఇందులో మండల కమిటీ సభ్యులు నేలికంటి నర్సింహా, శాఖ కార్యదర్శులు అరూరి దుర్గయ్య, సూరకంటి మోహన్ రెడ్డి, అరూరి శంబయ్య, ఆడెపు రమేష్, మామిడి రాములు, బొంగు లక్ష్మి నరసింహ స్వామి, కందటి యాదిరెడ్డి, గోలి నరసింహ, వట్టిపల్లి యాదయ్య, ఎంపాల లచిరెడ్డి, బొంగు నరేందర్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి