అల్కాపురి కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అల్కాపురి కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Editor Desk
నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల 21వ డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు భారీ సంఖ్యలో హాజరై అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కోశాధికారి చొక్కాల బ్రాహ్మణ చారి, ఉప కోశాధికారి బొజ్జ సైదులు, ఉప ప్రధాన కార్యదర్శి అద్దంకి వెంకన్న, కిషోర్, సుదర్శన్, శివకుమార్, చింతమల్ల సుదర్శన్, బాదే సుధాకర్, కే పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి