రామన్నపేట: మూసి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఘటనను పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. శోబనద్రిపురం గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, అక్రమ ఇసుక రవాణాపై నమ్మదగిన సమాచారం అందడంతో రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ మూడు ట్రాక్టర్లలో ఇసుక లోడుతో ఉన్న వాహనాలను గుర్తించారు.
వాహనదారులను అనుమతుల గురించి ప్రశ్నించగా ఎటువంటి రవాణా అనుమతులు లేకపోవడంతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శోబనద్రిపురానికి చెందిన ముక్కముల శ్రీశైలం, ఎరుకట్ల స్వామి, బోడిగె మధు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తేలింది.
దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి