Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:46 PM

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు.. ముగ్గురిపై కేసు

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు.. ముగ్గురిపై కేసు

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు.. ముగ్గురిపై కేసు
April 09, 2026 08:06 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మూసి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఘటనను పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. శోబనద్రిపురం గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, అక్రమ ఇసుక రవాణాపై నమ్మదగిన సమాచారం అందడంతో రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ మూడు ట్రాక్టర్లలో ఇసుక లోడుతో ఉన్న వాహనాలను గుర్తించారు.

వాహనదారులను అనుమతుల గురించి ప్రశ్నించగా ఎటువంటి రవాణా అనుమతులు లేకపోవడంతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శోబనద్రిపురానికి చెందిన ముక్కముల శ్రీశైలం, ఎరుకట్ల స్వామి, బోడిగె మధు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తేలింది.

దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News