ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
Vikram
సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట మండలం ఇమాంపేట్ గ్రామంలో ఐకేపీ (ఇందిరా క్రాంతి పథకం) ఆధ్వర్యంలో శనివారం ఇమాంపేట్ సంఘబంధం-1, 2 ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను అమ్మాలని సూచించిన ఆయన, వాతావరణ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటంతో కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తేమ శాతం 17 లోపే ఉండాలని, బస్తా బరువు 41 కిలోలకే పరిమితం చేయాలని, ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమాంపేట్ గ్రామ సర్పంచ్ నరిగే నాగేశ్వరి నాగరాజు, ఉప సర్పంచ్ చింత చైతన్య సతీష్, మాజీ సర్పంచ్ పాముల ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నకిరేకంటి బాలకృష్ణ, అబ్దుల్ కరీం, వార్డ్ సభ్యులు మునగాల జ్యోతి సాలయ్య, రేగురి హరీష్, నకిరేకంటి మాధవి సురేందర్, నాశబోయిన స్వాతి రవి, నకిరేకంటి మానస సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు బైరు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా సంఘం అధ్యక్షులు, వీఓలు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి