Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 PM

ఐక్యతకు నాంది పలికిన ‘రన్ ఫర్ జీసస్

ఐక్యతకు నాంది పలికిన ‘రన్ ఫర్ జీసస్

ఐక్యతకు నాంది పలికిన ‘రన్ ఫర్ జీసస్
April 05, 2026 08:25 AM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

పట్టణ కేంద్రంలో నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం సామాజిక ఐక్యతకు నాంది పలికింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌సీఎం చర్చ్ నల్గొండ డయాసిస్ బిషప్ కర్ణం ధమన్ కుమార్ మాట్లాడుతూ, ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు.

ప్రజల మధ్య విభేదాలు కాకుండా మానవత్వం పెంపొందాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మానవసేవే మాధవసేవ అని, పేదల జీవితాల్లో వెలుగు నింపే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దేవుడు చూపించిన మార్గం మానవత్వమేనని, అదే మార్గంలో నడవాలని అన్నారు.

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమెర్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత, భక్తులు ఈ రన్‌లో పాల్గొని ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News