Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:10 AM

ఐక్యతకు నాంది పలికిన ‘రన్ ఫర్ జీసస్

ఐక్యతకు నాంది పలికిన ‘రన్ ఫర్ జీసస్

ఐక్యతకు నాంది పలికిన ‘రన్ ఫర్ జీసస్
April 05, 2026 08:25 AM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

పట్టణ కేంద్రంలో నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం సామాజిక ఐక్యతకు నాంది పలికింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌సీఎం చర్చ్ నల్గొండ డయాసిస్ బిషప్ కర్ణం ధమన్ కుమార్ మాట్లాడుతూ, ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు.

ప్రజల మధ్య విభేదాలు కాకుండా మానవత్వం పెంపొందాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మానవసేవే మాధవసేవ అని, పేదల జీవితాల్లో వెలుగు నింపే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దేవుడు చూపించిన మార్గం మానవత్వమేనని, అదే మార్గంలో నడవాలని అన్నారు.

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమెర్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత, భక్తులు ఈ రన్‌లో పాల్గొని ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News