నల్గొండ,
పట్టణ కేంద్రంలో నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం సామాజిక ఐక్యతకు నాంది పలికింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్సీఎం చర్చ్ నల్గొండ డయాసిస్ బిషప్ కర్ణం ధమన్ కుమార్ మాట్లాడుతూ, ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ప్రజల మధ్య విభేదాలు కాకుండా మానవత్వం పెంపొందాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మానవసేవే మాధవసేవ అని, పేదల జీవితాల్లో వెలుగు నింపే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దేవుడు చూపించిన మార్గం మానవత్వమేనని, అదే మార్గంలో నడవాలని అన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమెర్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత, భక్తులు ఈ రన్లో పాల్గొని ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి