అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: ఫైర్ ఆఫీసర్ బి. శివాజీ
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: ఫైర్ ఆఫీసర్ బి. శివాజీ
K.RAVI
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా (ఏప్రిల్ 14 నుంచి 20 వరకు) బుధవారం స్థానిక చౌటుప్పల్ బస్టాండ్లో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చౌటుప్పల్ అగ్నిమాపక కేంద్ర అధికారి బి. శివాజీ మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా కాలిపోతున్న అగ్గిపుల్లలు, బీడీలు, సిగరెట్లు ఆర్పకుండా పారవేయడం వల్ల ఎండుగడ్డికి నిప్పు అంటుకుని, ఆ మంటలు సమీపంలోని భవనాలకు, హోటళ్లకు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు ప్రమాద నివారణోపాయాలను ప్రత్యక్షంగా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎల్.ఎఫ్.ఎఫ్ జి. నగేష్, సిబ్బంది కె. శేఖర్, జి. నాగరాజు, ఎ. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి