Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 04:29 PM

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: ఫైర్ ఆఫీసర్ బి. శివాజీ

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: ఫైర్ ఆఫీసర్ బి. శివాజీ

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: ఫైర్ ఆఫీసర్ బి. శివాజీ
April 15, 2026 03:25 PM 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా (ఏప్రిల్ 14 నుంచి 20 వరకు) బుధవారం స్థానిక చౌటుప్పల్ బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​​ఈ సందర్భంగా చౌటుప్పల్ అగ్నిమాపక కేంద్ర అధికారి బి. శివాజీ మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా కాలిపోతున్న అగ్గిపుల్లలు, బీడీలు, సిగరెట్లు ఆర్పకుండా పారవేయడం వల్ల ఎండుగడ్డికి నిప్పు అంటుకుని, ఆ మంటలు సమీపంలోని భవనాలకు, హోటళ్లకు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. ​ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు ప్రమాద నివారణోపాయాలను ప్రత్యక్షంగా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎల్.ఎఫ్.ఎఫ్ జి. నగేష్, సిబ్బంది కె. శేఖర్, జి. నాగరాజు, ఎ. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News