Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:51 PM

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి
08-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి సేవల నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.

కేంద్రంలో నమోదు అయిన పిల్లల సంఖ్య, ప్రతిరోజూ హాజరయ్యే వారి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందుతున్నదా అని విచారించారు. ఈ సందర్భంగా పిల్లలకు వడ్డించిన భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఆహారం తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.

చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంటూ, రోజువారీగా నిర్వహించే విద్యా, వినోద కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలతో మాట్లాడి ఏబీసీడీలు చెప్పించగా వారి ప్రతిభను అభినందించారు. గర్భిణీలు, బాలింతలకు అందించే సేవలు సక్రమంగా ఉండేలా, వారికి అవసరమైన పోషకాహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి

Article Image

యాదగిరిగుట్ట, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి సేవల నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.

కేంద్రంలో నమోదు అయిన పిల్లల సంఖ్య, ప్రతిరోజూ హాజరయ్యే వారి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందుతున్నదా అని విచారించారు. ఈ సందర్భంగా పిల్లలకు వడ్డించిన భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఆహారం తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.

చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంటూ, రోజువారీగా నిర్వహించే విద్యా, వినోద కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలతో మాట్లాడి ఏబీసీడీలు చెప్పించగా వారి ప్రతిభను అభినందించారు. గర్భిణీలు, బాలింతలకు అందించే సేవలు సక్రమంగా ఉండేలా, వారికి అవసరమైన పోషకాహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News