అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి
అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి
Editor Desk
యాదగిరిగుట్ట, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి సేవల నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.
కేంద్రంలో నమోదు అయిన పిల్లల సంఖ్య, ప్రతిరోజూ హాజరయ్యే వారి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందుతున్నదా అని విచారించారు. ఈ సందర్భంగా పిల్లలకు వడ్డించిన భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఆహారం తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.
చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంటూ, రోజువారీగా నిర్వహించే విద్యా, వినోద కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలతో మాట్లాడి ఏబీసీడీలు చెప్పించగా వారి ప్రతిభను అభినందించారు. గర్భిణీలు, బాలింతలకు అందించే సేవలు సక్రమంగా ఉండేలా, వారికి అవసరమైన పోషకాహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి