Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ వైద్యం పేదలకు వరం: 7వ వార్డు మెంబర్ చినపాక రమేష్ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 06:33 PM

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి

అంగన్వాడీల్లో పోషకాహారం, పరిశుభ్రతపై కలెక్టర్ దృష్టి
April 08, 2026 04:09 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి సేవల నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.

కేంద్రంలో నమోదు అయిన పిల్లల సంఖ్య, ప్రతిరోజూ హాజరయ్యే వారి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందుతున్నదా అని విచారించారు. ఈ సందర్భంగా పిల్లలకు వడ్డించిన భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఆహారం తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.

చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంటూ, రోజువారీగా నిర్వహించే విద్యా, వినోద కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలతో మాట్లాడి ఏబీసీడీలు చెప్పించగా వారి ప్రతిభను అభినందించారు. గర్భిణీలు, బాలింతలకు అందించే సేవలు సక్రమంగా ఉండేలా, వారికి అవసరమైన పోషకాహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News