Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:10 PM

అంగన్వాడీ పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ వెంకటేశం

అంగన్వాడీ పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ వెంకటేశం

అంగన్వాడీ పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ వెంకటేశం
23-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల:

అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం సూచించారు.

మునిపంపుల అంగన్వాడీ సెక్టార్ పరిధిలో పోషణ పక్వాడ దివాస్ సందర్భంగా ఐసిడిఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ, పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదని, గ్రామాల్లో లభించే పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, ఆకుకూరలను సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా, గ్రామంలో పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు స్థానికంగా లభించే ఆరోగ్యకర ఆహార పదార్థాల ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, అంగన్వాడీ టీచర్లు బద్రుని సాబేగం, బాదె మంజుల, యాదాసు శోభ, ఏలూరు అనిత, ఆశా వర్కర్లు మామిండ్ల లక్ష్మి, గాదె అలివేలు, ఏఎన్ఎం సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..

Sthanikam

అంగన్వాడీ పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ వెంకటేశం

Article Image

మునిపంపుల:

అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం సూచించారు.

మునిపంపుల అంగన్వాడీ సెక్టార్ పరిధిలో పోషణ పక్వాడ దివాస్ సందర్భంగా ఐసిడిఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ, పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదని, గ్రామాల్లో లభించే పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, ఆకుకూరలను సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా, గ్రామంలో పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు స్థానికంగా లభించే ఆరోగ్యకర ఆహార పదార్థాల ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, అంగన్వాడీ టీచర్లు బద్రుని సాబేగం, బాదె మంజుల, యాదాసు శోభ, ఏలూరు అనిత, ఆశా వర్కర్లు మామిండ్ల లక్ష్మి, గాదె అలివేలు, ఏఎన్ఎం సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News