అంగన్వాడీ పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ వెంకటేశం
అంగన్వాడీ పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ వెంకటేశం
Editor Desk
మునిపంపుల:
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం సూచించారు.
మునిపంపుల అంగన్వాడీ సెక్టార్ పరిధిలో పోషణ పక్వాడ దివాస్ సందర్భంగా ఐసిడిఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ, పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదని, గ్రామాల్లో లభించే పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, ఆకుకూరలను సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.
ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా, గ్రామంలో పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు స్థానికంగా లభించే ఆరోగ్యకర ఆహార పదార్థాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, అంగన్వాడీ టీచర్లు బద్రుని సాబేగం, బాదె మంజుల, యాదాసు శోభ, ఏలూరు అనిత, ఆశా వర్కర్లు మామిండ్ల లక్ష్మి, గాదె అలివేలు, ఏఎన్ఎం సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి