Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:02 PM

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన – పోషకాహారం, సేవలపై డైరెక్టర్ శృతి హోజ

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన – పోషకాహారం, సేవలపై డైరెక్టర్ శృతి హోజ

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన – పోషకాహారం, సేవలపై డైరెక్టర్  శృతి హోజ
08-04-2026 238 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోషకాహారం, హాజరు పై దృష్టి

యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి హోజ బీబీనగర్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు 5, 6తో పాటు రామునిగుండ్ల తండాను సందర్శించారు.

సందర్శన సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార నిల్వలను పరిశీలించిన ఆమె, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అందిస్తున్న భోజనాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా అనే అంశంపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాల నిర్వహణపై టీచర్లతో చర్చించి, పిల్లలతో ముచ్చటించారు. రామునిగుండ్ల తండా సర్పంచ్‌తో మాట్లాడి స్థానిక సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.

అలాగే నిర్మాణంలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్, సఖి (OSC) సెంటర్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, CDPO శైలజ, సూపర్వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన – పోషకాహారం, సేవలపై డైరెక్టర్ శృతి హోజ

Article Image

పోషకాహారం, హాజరు పై దృష్టి

యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి హోజ బీబీనగర్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు 5, 6తో పాటు రామునిగుండ్ల తండాను సందర్శించారు.

సందర్శన సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార నిల్వలను పరిశీలించిన ఆమె, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అందిస్తున్న భోజనాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా అనే అంశంపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాల నిర్వహణపై టీచర్లతో చర్చించి, పిల్లలతో ముచ్చటించారు. రామునిగుండ్ల తండా సర్పంచ్‌తో మాట్లాడి స్థానిక సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.

అలాగే నిర్మాణంలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్, సఖి (OSC) సెంటర్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, CDPO శైలజ, సూపర్వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News