అంగన్వాడీ కేంద్రాల పరిశీలన – పోషకాహారం, సేవలపై డైరెక్టర్ శృతి హోజ
అంగన్వాడీ కేంద్రాల పరిశీలన – పోషకాహారం, సేవలపై డైరెక్టర్ శృతి హోజ
Editor Desk
పోషకాహారం, హాజరు పై దృష్టి
యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి హోజ బీబీనగర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు 5, 6తో పాటు రామునిగుండ్ల తండాను సందర్శించారు.
సందర్శన సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార నిల్వలను పరిశీలించిన ఆమె, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అందిస్తున్న భోజనాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా అనే అంశంపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాల నిర్వహణపై టీచర్లతో చర్చించి, పిల్లలతో ముచ్చటించారు. రామునిగుండ్ల తండా సర్పంచ్తో మాట్లాడి స్థానిక సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.
అలాగే నిర్మాణంలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్, సఖి (OSC) సెంటర్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, CDPO శైలజ, సూపర్వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి