Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 25, 2026 03:20 PM

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు
February 25, 2026 01:51 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజ్, ఈద్ గాహ్ పనులకు గ్రీన్ సిగ్నల్

ఆదోని: ముస్లిం మైనారిటీ సోదరుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు నిధుల మంజూరు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు స్థానిక నాయకులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మైనారిటీ శాఖ మంత్రి ఎన్.డి. ఫరూక్ ను కలిసి ఆదోనిలోని అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు లభించినట్లు సమాచారం.

ప్రధాన పనులు ఇవే…

అరేకల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల: రూ. 18 కోట్లతో నిర్మాణం వేగవంతం.

ఆదోని ఉర్దూ మాధ్యమ జూనియర్ కాలేజ్: రూ. 2.50 కోట్లతో పనులు పూర్తికి చేరువ.

మొహమ్మద్ అలీ షాదీఖానా: రూ. 1.25 కోట్లతో అసంపూర్తి పనుల పూర్తి.

షాహీ ఈద్ గాహ్: రూ. 2.60 కోట్లతో పునర్నిర్మాణానికి చర్యలు.

అభివృద్ధి అంశాలపై మంత్రి నారా లోకేష్ తో కూడా చర్చలు జరిపినట్లు నేతలు తెలిపారు. నిధుల విడుదల అనంతరం పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News