Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:43 PM

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు
February 25, 2026 01:51 PM 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజ్, ఈద్ గాహ్ పనులకు గ్రీన్ సిగ్నల్

ఆదోని: ముస్లిం మైనారిటీ సోదరుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు నిధుల మంజూరు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు స్థానిక నాయకులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మైనారిటీ శాఖ మంత్రి ఎన్.డి. ఫరూక్ ను కలిసి ఆదోనిలోని అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు లభించినట్లు సమాచారం.

ప్రధాన పనులు ఇవే…

అరేకల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల: రూ. 18 కోట్లతో నిర్మాణం వేగవంతం.

ఆదోని ఉర్దూ మాధ్యమ జూనియర్ కాలేజ్: రూ. 2.50 కోట్లతో పనులు పూర్తికి చేరువ.

మొహమ్మద్ అలీ షాదీఖానా: రూ. 1.25 కోట్లతో అసంపూర్తి పనుల పూర్తి.

షాహీ ఈద్ గాహ్: రూ. 2.60 కోట్లతో పునర్నిర్మాణానికి చర్యలు.

అభివృద్ధి అంశాలపై మంత్రి నారా లోకేష్ తో కూడా చర్చలు జరిపినట్లు నేతలు తెలిపారు. నిధుల విడుదల అనంతరం పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News