Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 PM

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్
07-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎస్‌ఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సంఘం నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ... అకాడమిక్‌ సంవత్సరానికి ముందుగానే అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తల్లిదండ్రులను మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి అక్రమాలపై దృష్టి సారించాలని కోరారు.

ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ఎదుట నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ నాయకులు మహేష్‌, అరవింద్‌, విక్రమ్‌, హనుమేష్‌, రమణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్

Article Image

ఆదోని పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎస్‌ఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సంఘం నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ... అకాడమిక్‌ సంవత్సరానికి ముందుగానే అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తల్లిదండ్రులను మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి అక్రమాలపై దృష్టి సారించాలని కోరారు.

ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ఎదుట నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ నాయకులు మహేష్‌, అరవింద్‌, విక్రమ్‌, హనుమేష్‌, రమణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News