Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎడిటర్ శ్రీ కొండా మల్లేశం గౌడ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం: సీపీఎం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 04:23 AM

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్

ఆదోనిలో కార్పొరేట్ స్కూళ్ల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోండి: డీఎస్‌ఎఫ్
April 07, 2026 02:34 AM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎస్‌ఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సంఘం నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ... అకాడమిక్‌ సంవత్సరానికి ముందుగానే అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తల్లిదండ్రులను మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి అక్రమాలపై దృష్టి సారించాలని కోరారు.

ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ఎదుట నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ నాయకులు మహేష్‌, అరవింద్‌, విక్రమ్‌, హనుమేష్‌, రమణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News