Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 PM

ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం

ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం

ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం
March 10, 2026 03:24 PM 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్కానింగ్ కోసం గంటల తరబడి వేచిచూస్తున్న గర్భిణులు.. ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడకపోవడం బాధాకరమని సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ పేర్కొన్నారు.

ఆదోని మహిళా శిశు ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వందలాది గర్భిణులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆయన తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటం, స్కానింగ్ యంత్రాల కొరత కారణంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేదలుగా పుట్టడమే ఆ మహిళలు చేసిన పాపమా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు అయినా ఆదోని పట్టణ సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో వంద శాతం హాజరు ఉన్న ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి అందని ద్రాక్షగా మారిందని అన్నారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే పార్థసారథి చొరవ తీసుకుని ఆదోని నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే నిర్లక్ష్య పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ల కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News