Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:17 AM

ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం

ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం

ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం
March 10, 2026 03:24 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్కానింగ్ కోసం గంటల తరబడి వేచిచూస్తున్న గర్భిణులు.. ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడకపోవడం బాధాకరమని సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ పేర్కొన్నారు.

ఆదోని మహిళా శిశు ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వందలాది గర్భిణులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆయన తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటం, స్కానింగ్ యంత్రాల కొరత కారణంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేదలుగా పుట్టడమే ఆ మహిళలు చేసిన పాపమా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు అయినా ఆదోని పట్టణ సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో వంద శాతం హాజరు ఉన్న ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి అందని ద్రాక్షగా మారిందని అన్నారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే పార్థసారథి చొరవ తీసుకుని ఆదోని నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే నిర్లక్ష్య పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ల కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News