ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం
ఆదోని ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆగ్రహం
Editor Desk
స్కానింగ్ కోసం గంటల తరబడి వేచిచూస్తున్న గర్భిణులు.. ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్
ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడకపోవడం బాధాకరమని సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ పేర్కొన్నారు.
ఆదోని మహిళా శిశు ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వందలాది గర్భిణులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆయన తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటం, స్కానింగ్ యంత్రాల కొరత కారణంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేదలుగా పుట్టడమే ఆ మహిళలు చేసిన పాపమా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు అయినా ఆదోని పట్టణ సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో వంద శాతం హాజరు ఉన్న ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి అందని ద్రాక్షగా మారిందని అన్నారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే పార్థసారథి చొరవ తీసుకుని ఆదోని నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే నిర్లక్ష్య పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ల కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి