Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:11 PM

అందోల్ నియోజకవర్గం లోని రేగోడ్,అల్లాదుర్గ్,టేక్మాల్ చెరువులకు మహర్దశ .

అందోల్ నియోజకవర్గం లోని రేగోడ్,అల్లాదుర్గ్,టేక్మాల్ చెరువులకు మహర్దశ .

అందోల్ నియోజకవర్గం లోని రేగోడ్,అల్లాదుర్గ్,టేక్మాల్ చెరువులకు మహర్దశ .
January 24, 2026 09:12 PM 195 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ , అల్లాదుర్గ్ , రేగోడ్ మండలాల లోని చెరువు కట్టల పునరుద్ధరణ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష


రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో అందోల్ నియోజక వర్గంలోని అల్లాదుర్గ్, రెగోడ్, టేక్మాల్ (మెదక్ జిల్లా) మండలాలలో ఉన్న చెరువులు, కుంట కట్టల మరమ్మత్తులు, పీడర్ కెనాల్ పునరుద్దరణ పనులు, పంట కాల్వల నిర్మాణం, పునరుద్దరణ పనుల పై ఇరిగేషన్ అదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సమీక్ష లో అల్లాదుర్గ్ మండలం లో ఉన్న 132 , టెక్మాల్ మండలం లోని 135 , రేగోడ్ మండలం లోని 91 చెరువులు, కుంటలు, పీడర్ కేనాల్ లు , పంట కాల్వల మరమ్మత్తుల కోసం బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలు రూపోందించాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను అదేశించారు.


అల్లాదుర్గ్ మండలం లోని చెరువుల, కుంటల క్రింద 5778 ఎకరాలలో సాగు అవుతున్న అయాకట్, టెక్మాల్ మండలంలోని 5802 ఎకరాలలో సాగు అవుతున్న అయాకట్, రేగోడ్ మండలం లోని 4011 ఎకరాలలో సాగు అవుతున్న ఆయాకట్ లకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించటం తో పాటు అదనపు ఆయకట్టు ను పెంచటానికి చెరువుల మరమ్మత్తు పనులు ఈ సీజన్ లో పూర్తి చేసేలా అవసరమైన కార్యాచరణ ను రూపోందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇరిగేషన్ శాఖాధికారులను అదేశించారు.


టేక్మాల్ మండలం లోని చిన్నచెరువు, పెద్ద చెరువు, అల్లాదుర్గ్ లోని పటేల్ చెరువు, అల్లాదుర్గ్ చెరువు, బోల్కం చెరువు , గడ్డి పెద్దాపూర్ చెరువు, అప్పాజి పల్లి గిద్దమ్మ చెరువు, రామ్ పూర్ చెరువు, ముప్పారం చెరువు, నల్లకుంట చెరువుల కట్టల మరమ్మత్తుల తోపాటు ఫీడర్ కెనాల్ , పంట కాల్వల నిర్మాణం, పునరుద్ధరణ పనులపై మంత్రి చర్చించారు. అలాగే, రేగోడ్ మండలం లోని రేగోడ్ పెద్ద చెరువు , గజ్వాడ , కామోల్లి, కోత్వాల్ పల్లి పెద్ద చెరువుల చెర్వు కట్టల మరమ్మత్తు , ఫీడర్ కెనాల్ , పంట కాల్వల పనుల పునరుద్దరణ పనులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనాల ప్రతిపాదనలను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఇరిగేషన్ శాఖాధికారులను అదేశించారు.


ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ ఈ ఈ రవీంద్ర కిషన్, డిప్యూటి ఈ ఈ సుబ్బలక్ష్మీ, ఎ ఈ లు పాల్గోన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News