Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం: నర్సింహ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:44 PM

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. సర్పంచ్ గోపాల్ రెడ్డి

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. సర్పంచ్ గోపాల్ రెడ్డి

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. సర్పంచ్ గోపాల్ రెడ్డి
April 24, 2026 03:10 PM 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నీర్నంల గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి అన్నారు. గ్రామసభలో మాట్లాడిన ఆయన, తక్కువ కాలంలోనే పలు అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో రూ.10 లక్షలతో రెండు సీసీ రోడ్లు నిర్మించామని, మరో రూ.10 లక్షలతో స్త్రీశక్తి భవనం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రహదారుల పక్కన ఉన్న పిచ్చి చెట్లను తొలగించి గ్రామాన్ని శుభ్రంగా మార్చామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామని, గ్రామంలోని నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

గ్రామంలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి, చెత్త నిర్వహణను సక్రమంగా చేపడుతున్నామని, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు.

రైతులకు మార్కెట్ వద్ద నీటి సౌకర్యం కల్పించామని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

త్వరలోనే నీర్నంలను ఆదర్శ గ్రామంగా నిలబెట్టేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News