Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:03 PM

అంబేద్కర్ జయంతి ర్యాలీ ఘటన – పోలీసులపై ఆరోపణలు అసత్యం: డీఎస్పీ నరసింహప్ప

అంబేద్కర్ జయంతి ర్యాలీ ఘటన – పోలీసులపై ఆరోపణలు అసత్యం: డీఎస్పీ నరసింహప్ప

అంబేద్కర్ జయంతి ర్యాలీ ఘటన – పోలీసులపై ఆరోపణలు అసత్యం: డీఎస్పీ నరసింహప్ప
April 15, 2026 07:58 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సత్యసాయి జిల్లా, ఏప్రిల్ 15: అంబేద్కర్ జయంతి సందర్భంగా కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో నిర్వహించిన ర్యాలీ నేపథ్యంలో పోలీసులపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పెనుకొండ డీఎస్పీ, ధర్మవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ నరసింహప్ప తెలిపారు.

ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి గ్రామంలోని సున్నిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ర్యాలీ ప్రశాంతంగా సాగేందుకు సీఐ, ఎస్ఐలు మరియు సిబ్బందిని విధుల్లో నియమించామని చెప్పారు.

ఈ క్రమంలో సాయంత్రం సమయంలో గ్రామానికి చెందిన న్యాయవాది కె. చంద్రశేఖర్ రెడ్డి కొంతమందితో కలిసి ర్యాలీకి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఆయన దూకుడుగా ప్రవర్తిస్తూ పోలీసు సిబ్బందిని తోసిపుచ్చడంతో పాటు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. ఈ తోపులాటలో ఆయనకు స్వల్ప గాయం అయినట్లు తెలిపారు.

పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం కేసు నమోదు చేసి నోటీసు ఇచ్చి అదే రాత్రి విడుదల చేసినట్లు వివరించారు. ర్యాలీ అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.

అయితే అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో “పోలీసులు కొట్టారు, రూ.3 లక్షలు లాక్కొన్నారు” అంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని డీఎస్పీ స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి న్యాయవాదుల వర్గాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని అన్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని డీఎస్పీ నరసింహప్ప విజ్ఞప్తి చేశారు.

— పెనుకొండ సబ్-డివిజన్ పోలీస్ కార్యాలయం

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News