Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:50 PM

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ
01-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలుసభ్యసమాజంతలదించుకునేలా ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులురాలు గద్దె అనురాధ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి స్థాయి లేని వ్యక్తిగత దూషణలకు దిగడం, వైకాపా రాజకీయ సంస్కృతి ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందనిఆమెమండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమేనని, కానీ వ్యక్తిగత అవమానాలు, నీచ పదజాలంరాజకీయంగాఅంగీకరించదగినవి కావని గద్దె అనురాధ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ముందు ఆయనే కాకుండా, వాటిని అడ్డుకోలేని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.వైకాపా ఎదుర్కొన్న ఘోర పరాజయానికి ప్రజలను నిందించడం పూర్తిగా హాస్యాస్పదమని, ఆ పార్టీ పతనానికి పూర్తి బాధ్యత వైకాపా నాయకులదేనని ఆమె స్పష్టం చేశారు. వైకాపా ఓటమి ప్రతిపక్షాల కుట్ర వల్ల కాదని, అది పూర్తిగా వారి అహంకారం, అదుపు లేని మాటలు, ప్రజా వ్యతిరేక విధానాల ఫలితమని వ్యాఖ్యానించారు.ప్రజలను, వ్యవస్థలను, రాజ్యాంగబద్ధ సంస్థలను, వ్యక్తులను దూషిస్తూ మాట్లాడటమే రాజకీయ బలం అన్న భ్రమ వైకాపా నేతల్లో బలంగా చోటు చేసుకుందని, అదే వారి రాజకీయ పతనానికి మూలకారణమైందన్నారు. వైకాపాకు శత్రువు బయట ఎక్కడో లేడని, అద్దంలో చూసుకుంటేనే వారి అసలు శత్రువు కనిపిస్తాడనిఘాటుగావ్యాఖ్యానించారు.వైకాపా ఓటమి ఎన్నికల రోజున ప్రారంభం కాలేదని, 5 సంవత్సరాలవారి నాయకుల మాటల్లో, ప్రవర్తనలోనే మొదలైందని ఆమె అన్నారు. అహంకారం అసహనం దూషణలు ప్రజా వ్యతిరేకత పార్టీ పతనంఇదే వైకాపా రాజకీయ ప్రయాణమని గద్దె అనురాధ వివరించారు. ప్రజలు వైకాపాను తిప్పికొట్టలేదని, వైకాపా నాయకుల ప్రవర్తనే ప్రజలను తిప్పికొట్టేలా చేసిందని ఆమె స్పష్టం చేశారు. వైకాపా రాజకీయంగా ఓడిపోకముందే నైతికంగా పూర్తిగా పతనమైందని, నాయకుల దూషణలే ఆ పార్టీ రాజకీయ అంత్యక్రియలకు కారణమయ్యాయని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటమి అనేది ఓటర్ల తీర్పు అయితే, వైకాపా ఓటమి మాత్రం వారి నాయకుల తప్పిదాలకు వచ్చిన శిక్షేనని గద్దె అనురాధ తేల్చి చెప్పారు.


Sthanikam

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ

Article Image

వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలుసభ్యసమాజంతలదించుకునేలా ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులురాలు గద్దె అనురాధ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి స్థాయి లేని వ్యక్తిగత దూషణలకు దిగడం, వైకాపా రాజకీయ సంస్కృతి ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందనిఆమెమండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమేనని, కానీ వ్యక్తిగత అవమానాలు, నీచ పదజాలంరాజకీయంగాఅంగీకరించదగినవి కావని గద్దె అనురాధ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ముందు ఆయనే కాకుండా, వాటిని అడ్డుకోలేని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.వైకాపా ఎదుర్కొన్న ఘోర పరాజయానికి ప్రజలను నిందించడం పూర్తిగా హాస్యాస్పదమని, ఆ పార్టీ పతనానికి పూర్తి బాధ్యత వైకాపా నాయకులదేనని ఆమె స్పష్టం చేశారు. వైకాపా ఓటమి ప్రతిపక్షాల కుట్ర వల్ల కాదని, అది పూర్తిగా వారి అహంకారం, అదుపు లేని మాటలు, ప్రజా వ్యతిరేక విధానాల ఫలితమని వ్యాఖ్యానించారు.ప్రజలను, వ్యవస్థలను, రాజ్యాంగబద్ధ సంస్థలను, వ్యక్తులను దూషిస్తూ మాట్లాడటమే రాజకీయ బలం అన్న భ్రమ వైకాపా నేతల్లో బలంగా చోటు చేసుకుందని, అదే వారి రాజకీయ పతనానికి మూలకారణమైందన్నారు. వైకాపాకు శత్రువు బయట ఎక్కడో లేడని, అద్దంలో చూసుకుంటేనే వారి అసలు శత్రువు కనిపిస్తాడనిఘాటుగావ్యాఖ్యానించారు.వైకాపా ఓటమి ఎన్నికల రోజున ప్రారంభం కాలేదని, 5 సంవత్సరాలవారి నాయకుల మాటల్లో, ప్రవర్తనలోనే మొదలైందని ఆమె అన్నారు. అహంకారం అసహనం దూషణలు ప్రజా వ్యతిరేకత పార్టీ పతనంఇదే వైకాపా రాజకీయ ప్రయాణమని గద్దె అనురాధ వివరించారు. ప్రజలు వైకాపాను తిప్పికొట్టలేదని, వైకాపా నాయకుల ప్రవర్తనే ప్రజలను తిప్పికొట్టేలా చేసిందని ఆమె స్పష్టం చేశారు. వైకాపా రాజకీయంగా ఓడిపోకముందే నైతికంగా పూర్తిగా పతనమైందని, నాయకుల దూషణలే ఆ పార్టీ రాజకీయ అంత్యక్రియలకు కారణమయ్యాయని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటమి అనేది ఓటర్ల తీర్పు అయితే, వైకాపా ఓటమి మాత్రం వారి నాయకుల తప్పిదాలకు వచ్చిన శిక్షేనని గద్దె అనురాధ తేల్చి చెప్పారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News