Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:03 AM

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ

అంబటి రాంబాబు, జగన్ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె. అనురాధ
February 01, 2026 03:06 AM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలుసభ్యసమాజంతలదించుకునేలా ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులురాలు గద్దె అనురాధ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి స్థాయి లేని వ్యక్తిగత దూషణలకు దిగడం, వైకాపా రాజకీయ సంస్కృతి ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందనిఆమెమండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమేనని, కానీ వ్యక్తిగత అవమానాలు, నీచ పదజాలంరాజకీయంగాఅంగీకరించదగినవి కావని గద్దె అనురాధ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ముందు ఆయనే కాకుండా, వాటిని అడ్డుకోలేని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.వైకాపా ఎదుర్కొన్న ఘోర పరాజయానికి ప్రజలను నిందించడం పూర్తిగా హాస్యాస్పదమని, ఆ పార్టీ పతనానికి పూర్తి బాధ్యత వైకాపా నాయకులదేనని ఆమె స్పష్టం చేశారు. వైకాపా ఓటమి ప్రతిపక్షాల కుట్ర వల్ల కాదని, అది పూర్తిగా వారి అహంకారం, అదుపు లేని మాటలు, ప్రజా వ్యతిరేక విధానాల ఫలితమని వ్యాఖ్యానించారు.ప్రజలను, వ్యవస్థలను, రాజ్యాంగబద్ధ సంస్థలను, వ్యక్తులను దూషిస్తూ మాట్లాడటమే రాజకీయ బలం అన్న భ్రమ వైకాపా నేతల్లో బలంగా చోటు చేసుకుందని, అదే వారి రాజకీయ పతనానికి మూలకారణమైందన్నారు. వైకాపాకు శత్రువు బయట ఎక్కడో లేడని, అద్దంలో చూసుకుంటేనే వారి అసలు శత్రువు కనిపిస్తాడనిఘాటుగావ్యాఖ్యానించారు.వైకాపా ఓటమి ఎన్నికల రోజున ప్రారంభం కాలేదని, 5 సంవత్సరాలవారి నాయకుల మాటల్లో, ప్రవర్తనలోనే మొదలైందని ఆమె అన్నారు. అహంకారం అసహనం దూషణలు ప్రజా వ్యతిరేకత పార్టీ పతనంఇదే వైకాపా రాజకీయ ప్రయాణమని గద్దె అనురాధ వివరించారు. ప్రజలు వైకాపాను తిప్పికొట్టలేదని, వైకాపా నాయకుల ప్రవర్తనే ప్రజలను తిప్పికొట్టేలా చేసిందని ఆమె స్పష్టం చేశారు. వైకాపా రాజకీయంగా ఓడిపోకముందే నైతికంగా పూర్తిగా పతనమైందని, నాయకుల దూషణలే ఆ పార్టీ రాజకీయ అంత్యక్రియలకు కారణమయ్యాయని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటమి అనేది ఓటర్ల తీర్పు అయితే, వైకాపా ఓటమి మాత్రం వారి నాయకుల తప్పిదాలకు వచ్చిన శిక్షేనని గద్దె అనురాధ తేల్చి చెప్పారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News