Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:53 PM

పెట్రోల్‌ ధరల పెంపుపై డీవైఎఫ్‌ఐ నిరసన. బైక్‌లను నెట్టుకుంటూ వినూత్న ఆందోళన

పెట్రోల్‌ ధరల పెంపుపై డీవైఎఫ్‌ఐ నిరసన. బైక్‌లను నెట్టుకుంటూ వినూత్న ఆందోళన

పెట్రోల్‌ ధరల పెంపుపై డీవైఎఫ్‌ఐ నిరసన. బైక్‌లను నెట్టుకుంటూ వినూత్న ఆందోళన
May 26, 2026 11:52 AM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం నల్గొండలో సుభాష్‌ విగ్రహం నుంచి క్లాక్‌టవర్‌ వరకు బైక్‌లను నెట్టుకుంటూ వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ప్రజల ఆదాయం తగ్గుతున్న సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగినప్పుడు వెంటనే ఇంధన ధరలు పెంచుతున్న ప్రభుత్వం.. ధరలు తగ్గినప్పుడు మాత్రం ప్రజలకు ఉపశమనం కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే దశలవారీగా ధరలు పెంచడం ప్రజావ్యతిరేక చర్య అని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో కార్లపూడి రాము, మాదాసు రావణ్‌, ఎండీ అదిల్‌, శివ, సాయి, రోహిత్‌, మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News