Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:40 AM

నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు : డీఎస్పీ వెంకటరెడ్డి

నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు : డీఎస్పీ వెంకటరెడ్డి

నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు : డీఎస్పీ వెంకటరెడ్డి
25-05-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భారత దేశ నిర్మాతలని అన్నారు. వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేలా క్రీడలు, యోగ, సంగీతం, చిత్రకళ, బ్యూటీషన్ తదితర అంశాలలో ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్‌ఫోన్ వ్యామోహంలో పడుతూ ఆటపాటలు, సృజనాత్మక కార్యక్రమాలకు దూరమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మర్ క్యాంపు వారిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు ఎంతో దోహదపడిందన్నారు. గత 15 రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శించడం ఆనందంగా ఉందని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీజీహెచ్‌ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, అశోక్ గౌడ్, చంద్రశేఖర్ ఆచార్య, డాక్టర్ రాజయ్య, గురునాథ్, ధన్‌సింగ్, లీపు ఆర్టిస్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు : డీఎస్పీ వెంకటరెడ్డి

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భారత దేశ నిర్మాతలని అన్నారు. వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేలా క్రీడలు, యోగ, సంగీతం, చిత్రకళ, బ్యూటీషన్ తదితర అంశాలలో ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్‌ఫోన్ వ్యామోహంలో పడుతూ ఆటపాటలు, సృజనాత్మక కార్యక్రమాలకు దూరమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మర్ క్యాంపు వారిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు ఎంతో దోహదపడిందన్నారు. గత 15 రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శించడం ఆనందంగా ఉందని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీజీహెచ్‌ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, అశోక్ గౌడ్, చంద్రశేఖర్ ఆచార్య, డాక్టర్ రాజయ్య, గురునాథ్, ధన్‌సింగ్, లీపు ఆర్టిస్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News