నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు : డీఎస్పీ వెంకటరెడ్డి
నేటి విద్యార్థులే భావి భారత నిర్మాతలు : డీఎస్పీ వెంకటరెడ్డి
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భారత దేశ నిర్మాతలని అన్నారు. వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేలా క్రీడలు, యోగ, సంగీతం, చిత్రకళ, బ్యూటీషన్ తదితర అంశాలలో ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్ఫోన్ వ్యామోహంలో పడుతూ ఆటపాటలు, సృజనాత్మక కార్యక్రమాలకు దూరమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మర్ క్యాంపు వారిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు ఎంతో దోహదపడిందన్నారు. గత 15 రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శించడం ఆనందంగా ఉందని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీజీహెచ్ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, అశోక్ గౌడ్, చంద్రశేఖర్ ఆచార్య, డాక్టర్ రాజయ్య, గురునాథ్, ధన్సింగ్, లీపు ఆర్టిస్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి