PRINT TIME: May 26, 2026 01:53 PM
నీర్నంలలో ముందస్తు చర్యలు. మంచినీటి బోరు మరమ్మతు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ గోపాల్ రెడ్డి
నీర్నంలలో ముందస్తు చర్యలు. మంచినీటి బోరు మరమ్మతు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ గోపాల్ రెడ్డి
May 25, 2026 09:06 PM
113 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఎండాకాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీర్నంల గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని గోగు పాపులు బావి వద్ద ఉన్న గ్రామపంచాయతీ మంచినీటి బోరును మరమ్మతు చేయించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం, తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగించడం కోసం గ్రామపంచాయతీ కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, గ్రామపంచాయతీ సిబ్బంది ముత్యాల సాయిలు, గ్రామస్థులు ఆవుల లక్ష్మీనారాయణ, గోగు పాపులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి