Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 11:01 PM

25 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహాలు.. జ్ఞాపకాల సందడి

25 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహాలు.. జ్ఞాపకాల సందడి

25 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహాలు.. జ్ఞాపకాల సందడి
March 23, 2026 12:04 PM 225 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. రామన్నపేట మండల కేంద్రంలోని ఏవీఎం హై స్కూల్‌లో 2000–2001 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్థానిక అమృతవనంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరి మంచి చెడులు ఒకరు తెలుసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.

వారికి విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ గురువులు ఉయ్యాల రాములు, గోపాల్ రెడ్డి, ఏదుల్ల లక్ష్మారెడ్డిలను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమ్మేళనం నిర్వహణకు శ్రమించిన నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మేడబోయిన ఉపేందర్, ఆవుల నరేందర్, గాదె సతీష్, గాదె రాము, నోముల చంద్రశేఖర్, నల్ల వెంకట్ రెడ్డి, ఆకవరపు ఉదయ్ కుమార్, అప్పం సంతోష్, కునూరు లింగస్వామి, గుమ్ముల నర్సిరెడ్డి, మహేష్, కవిత, ప్రీతీ, హేమలత, మమత, సత్య శ్రీ, రాపోలు శ్యాంసుందర్, కొండ వెంకటేశం, శివకుమార్, రేవణాల సత్యనారాయణ, శ్రీకారం మథిన్, ఎస్కే మహబూబ్ జానీ, సునీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News