25 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహాలు.. జ్ఞాపకాల సందడి
25 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహాలు.. జ్ఞాపకాల సందడి
Editor Desk
రామన్నపేట,
దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. రామన్నపేట మండల కేంద్రంలోని ఏవీఎం హై స్కూల్లో 2000–2001 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్థానిక అమృతవనంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరి మంచి చెడులు ఒకరు తెలుసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.
వారికి విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ గురువులు ఉయ్యాల రాములు, గోపాల్ రెడ్డి, ఏదుల్ల లక్ష్మారెడ్డిలను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమ్మేళనం నిర్వహణకు శ్రమించిన నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మేడబోయిన ఉపేందర్, ఆవుల నరేందర్, గాదె సతీష్, గాదె రాము, నోముల చంద్రశేఖర్, నల్ల వెంకట్ రెడ్డి, ఆకవరపు ఉదయ్ కుమార్, అప్పం సంతోష్, కునూరు లింగస్వామి, గుమ్ముల నర్సిరెడ్డి, మహేష్, కవిత, ప్రీతీ, హేమలత, మమత, సత్య శ్రీ, రాపోలు శ్యాంసుందర్, కొండ వెంకటేశం, శివకుమార్, రేవణాల సత్యనారాయణ, శ్రీకారం మథిన్, ఎస్కే మహబూబ్ జానీ, సునీత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి