10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ పరీక్షలను ధైర్యంగా రాయాలి: సర్పంచ్ బోయిన వేణు
10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ పరీక్షలను ధైర్యంగా రాయాలి: సర్పంచ్ బోయిన వేణు
Kathula narsimha
నేలకొండపల్లి: మండలంలోని రాయిగూడెం గ్రామ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాల్ టికెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు రావాలని కోరుతూ మరోసారి అందరికీ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుంతరమోని నాగార్జున, సత్యనారాయణ, జి. రాజు, బి. నాగేశ్వరరావు, పి. నాగేశ్వరరావు, తిరుమల ప్రసాద్, నాగరాజు తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి