Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:13 PM

10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ పరీక్షలను ధైర్యంగా రాయాలి: సర్పంచ్ బోయిన వేణు

10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ పరీక్షలను ధైర్యంగా రాయాలి: సర్పంచ్ బోయిన వేణు

10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ పరీక్షలను ధైర్యంగా రాయాలి: సర్పంచ్ బోయిన వేణు
March 13, 2026 03:42 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

నేలకొండపల్లి: మండలంలోని రాయిగూడెం గ్రామ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాల్ టికెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు రావాలని కోరుతూ మరోసారి అందరికీ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుంతరమోని నాగార్జున, సత్యనారాయణ, జి. రాజు, బి. నాగేశ్వరరావు, పి. నాగేశ్వరరావు, తిరుమల ప్రసాద్, నాగరాజు తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News