PRINT TIME: June 28, 2026 01:23 AM
100 రోజుల్లో గ్రామాభివృద్ధి దిశగా బోగారం: సర్పంచ్ సాయి కుమార్ గౌడ్
100 రోజుల్లో గ్రామాభివృద్ధి దిశగా బోగారం: సర్పంచ్ సాయి కుమార్ గౌడ్
March 23, 2026 07:30 PM
66 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో
భారీ మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికై 100 రోజులు పూర్తి చేసుకున్న బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, గ్రామ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల మద్దతు, విశ్వాసంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.
తన పదవీకాలం ముగిసే వరకు ఇదే విధంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లగలమని అభిప్రాయపడ్డారు.
తనకు సర్పంచ్గా అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి