యువజన కాంగ్రెస్ క్రికెట్ టోర్నీ: విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
యువజన కాంగ్రెస్ క్రికెట్ టోర్నీ: విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
K.RAVI
యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో ప్రతిభ చాటి గెలుపొందిన విజేత జట్లకు రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి, ఎమ్మెల్యేకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రాసేనారెడ్డి, డీసీసీ కార్యదర్శి అర్ధ వెంకట్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, కాసార్ల శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బానబోయిన రామకృష్ణ యాదవ్, కొండూరు ధర్మేందర్ గౌడ్, పర్నె శివారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి