సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
గ్రామంలో జరిగిన ఘర్షణలో మధుపై ప్రత్యర్థులు దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలు, రాజకీయ విభేదాల కోణంలో దర్యాప్తు చేపట్టారు. మధు మృతితో యర్కారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి