Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:32 AM

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం
April 29, 2026 07:59 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు యాదగిరిగుట్టలో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ సెక్రటరీ బర్రె సుదర్శన్ తెలిపారు.

గురువారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. డి. శ్రీనివాసులు, నాబార్డ్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ పి. మోహనయ్య, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కే. ప్రతాప్ రెడ్డి, మాజీ చైర్మన్ రామచంద్రా రెడ్డి, సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎస్. వెంకటేశ్వర రెడ్డి, సెక్రటరీ జనరల్ గణపతి హెగ్డే, మాజీ జనరల్ సెక్రటరీ బి. రవికాంత్, గోల్డెన్ సభ్యుడు మారిశెట్టి వీరయ్య తదితరులు హాజరుకానున్నారు.

సమావేశంలో బ్యాంక్ స్థాపన, అభివృద్ధి ప్రయాణం, ఉద్యోగులు, పెన్షనర్ల సేవలు, బ్యాంక్ సాధించిన ప్రగతి తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ స్వర్ణోత్సవ వేడుకలకు సభ్యులు, ఉద్యోగులు, ఖాతాదారులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బర్రె సుదర్శన్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News