యాదాద్రి జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సూర్కంటి శ్రీధర్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
యాదాద్రి జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సూర్కంటి శ్రీధర్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
K.RAVI
మందోళ్లగూడెం ఉపసర్పంచ్కు కీలక బాధ్యతలు
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: శ్రీధర్రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మందోళ్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్లో నిర్వహించిన ఫోరం ముఖ్య సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చోట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన శ్రీధర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు సూర్కంటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన జిల్లాలోని ఉపసర్పంచులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల బలోపేతంతో పాటు, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఫోరం తరఫున శ్రమిస్తానని పేర్కొన్నారు.రాష్ట్ర అధ్యక్షుడు చోట్ల కార్తీక్ మాట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఉపసర్పంచుల ఫోరం మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపసర్పంచుల సంక్షేమానికి ఈ కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.శ్రీధర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక కావడం పట్ల జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నిక జిల్లా ఉపసర్పంచుల ఐక్యతకు నిదర్శనమని వారు కొనియాడారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి