వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం**
వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం**
RAPOLU LINGASWAMY
రంగారెడ్డి జిల్లా :సమాజ సేవలో ముందుండే బిజుమళ్ళ మాధవ సూర్యనారాయణ శర్మ సిద్ధాంతి స్మారక సేవ భారతి ట్రస్ట్ తన 16వ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన నారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి రూ.1,00,000 విరాళాన్ని ట్రస్ట్ ప్రతినిధులు అందజేశారు.
2010లో స్థాపించబడిన ఈ ట్రస్ట్ “ధర్మో రక్షతి రక్షిత అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని గత 16 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. వైదిక విద్యాభివృద్ధి, గోమాత సేవ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, అన్నదానం వంటి కార్యక్రమాలను ట్రస్ట్ చేపడుతోంది.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వృద్ధాశ్రమానికి అందజేసిన ఈ విరాళం సమాజం పట్ల తమ కృతజ్ఞతను తెలియజేసే చిన్న ప్రయత్నమని పేర్కొన్నారు.
రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ప్రతినిధులు ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందిన విరాళాన్ని వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి