ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక @99 కార్యాచరణలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) పథకం కింద యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి